Monday, June 14, 2010

కథే నిజమైతే ..

నిన్న నేషనల్ జియోగ్రఫీలో ఒక అద్భుత దృశ్యం నన్ను కట్టి పడేసింది ...ఎప్పుడు అనుకునే వాడిని ఇలా జరిగితే బాగుండు అని..అలానే జరిగింది ...

పెద్ద అడవి ..కొన్ని ఆడ సింహాలు , సింహం పిల్లలు కూర్చొని వున్నాయి..వాటికి దూరంగా రెండు అడవి దున్న పోతులు ఒక చిన్న దున్నపోతు ఈ సిమ్హాలున్న వైపుకే వస్తున్నాయి..సింహాలు పెద్ద పొదల చాటున ఉండటంతో వాటి ఉనికి పసి కట్టలేక పోయాయి ..దూరం నుండి ఈ తతంగం అంతా కెమెరాలో బందిస్తున్నారు..అప్పటికే ఆకలితో ఉన్న సింహాలు ఒక్క ఉదుటన దున్నపోతుల మీద పడ్డాయి..తత్తర పాటుతో దున్నపోతులు వెనక్కి ఒకటే పరుగు..సింహాలు అప్పటికే బలహీనంగా ఉన్న చిన్న దున్నపోతును టార్గెట్ చేసుకున్నాయి..అన్ని కలిసి దాని మీద పడి పక్కనే ఉన్న నదిలోకి దాన్ని ఈడ్చుకొని వెళ్ళాయి..
అయ్యో అనిపించి నేను ఛానల్ మార్చేసాను..ఒక పదినిమిషాల తర్వాత ఆ ఛానల్ చుస్తే మళ్లీ ఇదే వస్తుంది..ఆశ్చర్యంతో చూస్తే,, దూరం నుండి తమ కెమెరాల్లో జూమ్ చేసి మరీ ఈ దృశ్యాన్ని చూస్తూ ఛానల్ వారు సింహం ఎలా వేటాడు తుందో వివరిస్తున్నారు..ఒకరు, "ఇప్పుడు ఒక సింహం ఆ దున్నపోతు నోరు ముసి దానికి సఫకేషన్ కలుగచేస్తుందని మరొక సింహం దాని ట్రాకియా గట్టిగా పట్టి చంపివేస్తుందని"..కాని అక్కడ జరుగుతున్న తంతు వేరు..వ్యాఖ్యాతలు ఇంకో రెండు నిముషాలలో ఆ దున్నపోతు చనిపోతుందని అప్పుడు దాన్ని నీటి బయటకు లాగి సింహాలు తింటాయని అంటున్నారు..రెండు నిముషాలు గడిచాయి..ఇంకా దున్నపోతు పెనుగులాడుతోంది..హటాత్తుగా ఒక పెద్ద శబ్దం ..నీటిలో అలజడి..ఒక పెద్ద మొసలి సింహాలను అదిలించి దున్నపోతును నీటిలోకి లాగాలని ప్రయత్నిస్తుంది..
వ్యాఖ్యాతలు "ఇప్పుడు సింహాల ముందున్న ఆహరం ఎలా మొసలి తన్నుకు పోతుందో చూద్దాం " అంటున్నారు..

తీవ్రమైన పెనుగులాటలో దున్నపోతును సింహాలు నీటి బయటకు లాగేసాయి ..

ఇప్పుడు ఆశ్చర్యం వ్యాఖ్యాతల వంతు..
ఇంతలో దూరంనుండి దున్నపోతుల మంద..సింహాల వైపుకు దూసుకు వస్తుంది..
వాటిలో ఒక రెండు దున్నపోతులు మొత్తం సింహాలని తరిమి తరిమి కొట్టాయి..

ఇంకో నమ్మశక్యం కాని విషయం ఏంటంటే ..అప్పటి దాకా సింహాలతో పెనుగులాడిని చిన్న దున్నపోతు ఒక్క ఉదుటన లేచి మందలో కి పరిగెత్తుకొని వెళ్ళింది..

చిన్నప్పుడు పరవస్తు చిన్నయసూరి గారి కథలలో చదివిన కొన్ని సంఘటనలు కళ్ళముందు కనిపిస్తుంటే ఎలా వుంటుందో మీరే ఆలోచించుకోండి ..( పంచతంత్రంలో ఇలాంటి కథలేదని నన్ను అడగద్దు ..భావసారూప్యం కలిగిన కథగా అనుకోండి )...

టుగెదర్ వుయ్ కెన్ కానకర్...డివైడెడ్ వుయ్ ఫాల్ ...దీని తెలుగు నీతి మనందరికీ తెలిసినదే...

పైన చెప్పిన లాగ జరిగితే పర్యావరణ సమతుల్యం దెబ్బ తింటుందని అనిపిస్తే -- నో కామెంట్స్ ..

Friday, February 12, 2010

స్వర స్మరణీయుడు - ఘంటసాల


మొన్న బుధవారం టివిలో చానెల్స్ మారుస్తూ నేను అప్పుడప్పుడు చూసే దూరదర్శన్ దగ్గర ఆగిపోయాను..అక్కడ ప్రసారం అయ్యే కార్యక్రమం నన్ను కట్టిపడేసింది..అదే "స్వర స్మరణీయుడు"..విజయదుర్గ యాంకర్గా ఎవరొ ఒక ఆయన్ని ప్రశ్నలు వేస్తుంది..ఆశ్చర్యం అన్ని ప్రశ్నలకి ఆయన ఠపీమని జవాబులు ఇస్తున్నాడు..ఆయన ఒక ప్రభుత్వ ఊద్యొగి అట..ఘంటసాల గారి మీద ఎంతో రీసెర్చ్ చేశారట..ఎంత అభిమానం అనుకున్నా..యాంకర్ ఒక పాటని( కనిపించే పాట ఒకటీ వెనుక బాక్గ్రౌండ్లో వినిపించేది ఇంకొక పాట అన్నమాట) టివి స్క్రీన్ మీద చుపించి ఆ పాట గురించి అడగ్గానే ఆయన ఆ పాటలు ఏ సినెమాలో చేశారో ,స్వర పరిచింది ఎవరో ,ఎవరు రాసారో ,ఏ రాగంలో స్వరపరిచారో ,ఏ బానెర్ పై ఆ సినెమా రిలీస్ అయిందో ఇలాంటి విషయాలన్నీ అలవోకగా చెప్పేస్తున్నారు...ఆ మహనీయుడి మీద నిజమైన అభిమానం అంటే ఇదేనేమో అనుకున్నా..
ఘంటసాల గురించి ఎంత చెప్పినా తక్కువే..ఆయన పాటలు ఎప్పటికీ అజరామరాలు..ఆయన పాడిన భక్తి గీతాల్లో భక్తి రసం ఎలా ఉట్టిపడుతుందో అవి అస్వాదిస్తేకాని తెలీదు..."ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి.. నీ పద పీఠిక తలబడి"..ఆహా ప్రభాత వేళ పూజ చేస్తే ఇలాంటి అనుభూతి కలుగుతుందా ..తప్పకుండా...
"శయనించు మా అయ్య శ్రీ చిద్విలాసా"...ఆయన అమ్రుత గళంలో నుండి జాలు వారిని ఈ గీతం నిజంగా ఆ నల్లనయ్యకు ఒక మంచి జోలపాట...
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నొ మధురమైన పాటలు..ఒక్కొక్కటి ఒక్కో తీరు...
ఆయన వర్ధంతి రోజున అన్ని టివి చానెల్స్ ( పోటీ కొసమేమో మరి)ఆయన్ని తలుస్తూ మంచి కార్యక్రమాలు ప్రసారం చేసి ఈతరం వారికి ఆయన్ని పరిచయం చేసినందుకు...నాలాంటి అభిమానులకు ఆయన్ని స్మరించుకునే భాగ్యం కలుగచేసినందుకు క్రుతఙ్నతలు....

Friday, January 8, 2010

మీడియాలో దురంధరులు

ఈ మధ్య మీడియాలో వీరిని చూసిచూసి వీరి వాక్పటిమమీద ఒక చిన్న విశ్లేషణ :
కె సి ఆర్ :
"వాక్దురంధర"..రైమింగ్ పదాలతో వ్యాఖ్యలు చెయ్యటం లొ దిట్ట ( అని అనుకొంటాడు)..మాటకి ముందు వెనుక "తెలంగాణా" ఉంటుంది...తనకి తగ్గ తర్క విద్వాంసుడు లేడనుకొని ఎప్పుడు ఒంటరిగానే మీడియలో కనిపిస్తాడు..
హరీష్ రావు :
మామకి తగ్గ అల్లుడు..మామ స్రిప్టులని నొక్కేసి కొంత కపిత్వం జోడించి లొల్లి చేస్తుంటాడు...ఈయనికి తర్క జ్ణానం నిల్లు లొల్లి ఫుల్లు..ఈయనికి "వాక్డాంబిక" అనే బిరుదు కూడా ఉంది..తన పెంపుడు కుక్కకి పిల్లలు పుట్టకపోతే అది అంధ్రా వాళ్ళ పనే అనటానికి ఏమాత్రం సంకోచించడు..
కె కె:
ఏకకాలంలో తెలుగు , ఇంగ్లీష్ ,హిందీలలో మాట్లాడుతూ అసలేమి మట్లాడుతున్నాడో అర్థంకాక రిపోర్టెర్నే అర్థం అయిందా అని అడుగుతాడు..మాట్లాడే విధానంలో వెంకయ్యనాయుడికి ఈయనకి పోలికలుంటాయి..ఈయన బిరుదు "వాక్ దిగ్భ్రమ" ..
డి యస్ :
ఈయనకి నాల్క కాస్త మందం..తప్పు మాట్లాడకపోయినా తప్పే వినిపిస్తుంది..మట్లాడదామ వద్ద్దా అనే సంకోచెంతోనే మట్లాడుతుంటాడు..ఈయన బిరుదు "వాక్పీడన"..
చంద్రబాబు:
ఈయన మాటలు వినాలంటే టివి చూడకుండా వినాలి..టివి చూసినా ఈయన ముఖం అంటే కళ్ళని అస్సలు చూడద్దు..ఈయన కళ్ళకి అంటే ఫీలింగ్స్కీ చెప్పే మాటలకి అస్సలు మాచ్ అవ్వదు..ఈయన బిరుదు "వాక్ వైరుఢ్య"

నన్నపనేని:
ఈమె వాక్పటిమ ఎక్కువ లాజిక్ తక్కువ ..ఏ టాపిక్ ఇచ్చినా అనర్గళంగా మాట్లాడుతుంది..కాని కంటెంట్ తక్కువ..అస్సలు చదువుకోలెదు అంటుంది...పుస్తకాలు తినెసి వచ్చినట్టు మాట్లాడుతుంది...ఈమె బిరుదు "వాక్ దుంధిభి"
లగడపాటి:
ఈయన అసలు ప్రెస్సు కాంఫరెంసులు ఎందుకు పెడతాడో ఆయనకి గాని ప్రెస్సు వారికి గానీ తెలీదు....చెప్పాలనుకునేది ఒకటి చెప్పేది ఒకటి..ఈయన స్క్రిప్టులు ఎవరు తయారు చేస్తారో ఆ దేవుడికే ఎరుక..చెప్పేది తక్కువ "కాదు" "కాదు" అనటం ఎక్కువ...ఏమి కాదో ఎవరికి కాదో ??ఈయన బిరుదు "వాక్ సం(వి)చలన"

Thursday, January 7, 2010

ఈ పదాల అ(వ్య)ర్థమేమి

ఇవి కొన్ని సినిమాల్లొ వాడినవి::
కటింగ్ కొడుతున్నావా?
రఫ్ ఆడిస్తా
రంగు పడుద్ది
సీను సితార అవుతుంది
స్పాట్ పెడతా

వీటిలో కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడటం జరిగింది కాని వాటి అర్థాలు ఇక్కడ వేరు....

Thursday, December 24, 2009

హింసేనా మీ మార్గం

ఇప్పటికే మన నాయకులు అమాయక ప్రజలందరికి సంకేతాలు పంపారు...హింస వద్దు , ఆత్మహత్యలు వద్దు,ఆంధ్రవాళ్లు మన సహొదరులు వారి మీద దౌర్జన్యాలు వద్దు అని..చాలు ఈ సంకేతాలు మేము చూసుకుంటాం అని విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు...దీనివల్ల నష్టం ఎవరికి..పొద్దున ఎవరో టివిలో చెప్తున్నారు మాకు ఈ 50యేళ్ళలో జరిగిన నష్టం ముందు ఇది ఎంత అని..చాలా బాధాకరం..
విద్య , ఉద్యోగ అవకాశాలు, మౌళికవనరుల అభివ్రుద్దికి శాంతి ఎంతో ముఖ్యం ..

1)వేరే రాష్త్రం నుండి వేరే దేశమ్నుండి పెట్టుబడులు రావా లన్న
2)కొత్తగా విద్యాలయాలు స్థాపించాలన్న
3)కొత్త ఆరోగ్యకేంద్రాలు నిర్మించాలన్నా
4)ఉపాధి అవకాశాలు పెంచాలన్నా
5)మన పిల్లలని అతి ప్రమాదకరమైన వ్యాధులనుండి రక్షించి వారికి బంగారు భవిత ఇవ్వాలన్న
6)మనమందరం ఆరొగ్యకరమైన వాతవరణంలో పెరగాలన్నా

హింస విడనాడాలి..మన నిరసనని ఇంకొకరకంగా కూడా వ్యక్తపరచవచ్హు..

అందరికి తెలిసిన విషయమే అమెరికా ఇప్పటికే ట్రావెల్ అడ్వైసరీ అని వారి పౌరులను ఆంధ్రప్రదేశ్ వెల్లటం సురక్షితంకాదు అని చెప్పింది..
యూరోపియన్ యూనియన్ కూడా ఇలాంటి నిర్ణయం తీస్కున్నట్టు వినికిడి..
ఇది ఎవరికి నష్టం..
ఒకవేళ మేము ఎవరిమీద ఆధారపడం మా వుద్యోగాలు మేమే స్రుష్టిస్థాం అని అనుకుంటే చెయ్యగల్గిందేమిలేదు...
రాజకీయనాయకులు ఊసరవిల్లుల లంటివారు..యేయెండకా గొడుగు పట్టేరకం..వారి మోసపూరిత వాగ్దానాలు,విద్వేషాలు పెంచే ఉపన్యాసాలు చూసి మోసపొకండి. ...
ఇది మన మాత్రుభూమి మనమే దీనికి పునర్జీవనం తేవాలి...
ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్ అయినా మనం ఇంకా కుంచిత మనస్తత్వాలతో ఈ నేల నాది ఈ నింగి నాది అనుకోవటం ఎంతవరకు సబబు..
నేను ఒక ఎమెన్సి కంపనీ లో పనిచేస్తాను..మా కంపనీకి చెన్నై ,ముంబై లలో కుడా శాఖలు వున్నాయి,.మొత్తం ఉద్యోగుల సంఖ్య 8000పైచిలుకే ..ఈ గొడవల నేపధ్యంలో మొన్న సీనియర్ మానేజ్మెంట్ మీటింగ్ జరిగింది..చెన్నై కి చెందిన కొందరు సహోద్యొగులు ఇక్కడ(హైదరాబాదు) వాతావరణం బాగలేదని ఫారెన్ క్లైంట్లు ప్రాజెక్టు డెడ్లైన్లు మీట్ అవటంలేదని కనుక ఇక్కడినుండి ఉద్యోగులని చెన్నై తరలించమని రికమండ్ చేసారు..అలాఏమి లేదని నేను నా వాదన చేసాను..పరిస్థితులని గమనిస్తున్నామని మనకి క్లైంటే దేవుడు కాబట్టి వాడికి ఏమన్న ఇబ్బంది కలిగితే ఇక్కడి బేస్ చెన్నైకి మారుస్తామని మా డైరెక్టర్ చెప్పారు...మాలో చాలమంది తెలంగాణా జిల్లాలకి చెందినవారున్నారు....

అందరికి నా విన్నపం అమ్మలారా అయ్యలారా హింసని విడనాడండి..ఈ రొజు మీరు చేసే ఈ విధ్వంసాలు ఒక మాయని మచ్హని ఈ ప్రాంతానికి మిగులుస్తాయి..

అన్నట్టు నేను సమైక్యవాదిని కాను అలాగే తెలంగాణా వాదినికూడా కాదు..
ఒక మానవతా వాదిని..అహింసావాదిని..

Monday, December 21, 2009

ఇంకా ఎన్నాళ్ళు....

నిన్న రాత్రి రాజగోపాల్ అద్రుశ్యం ఈ రోజు నింస్ లోప్రత్యక్షం...
దీని మీద మీడియా హడావుడి..
ఒక చానెల్లో మరీ ఎక్కువగా ...ఇలా
ఇద్దరు ఎంపీలు..ఇద్దరిది ఒకే పంధా..ఒకరిని జైలుకి తరలించారు..ఇంకొకరిని పారిపోయేలా చేశారు ..ఎందుకీ వివక్ష అని చర్చ..ఇది నిజంగా పైత్యపు అలొచనలకి పరాకాష్ట ...
ఇంకా మీడియాకి కూడా రెగ్యులేషన్స్ పెట్టాలేమొ...
ఫ్రజల మధ్య విద్వేషాలు లేకపొయినా కలిపించటంలో అగ్రస్థానం మన నాయకులదైతే..రెండో స్థానం మీడియాది..
ఒక ప్రశ్న :
ఈ పరిస్థితుల్లో ఎవరికి ఏమిజరిగినా మొదటి టార్గెట్ ఎవరు?
ఇంకెవరు పాపం పోలీసులు ...వాళ్ళకే సస్పెన్షన్లు, మెమోలు.. ఇక్కడ చిన్నపిల్లవాడికి కూడా అర్థం అయ్యే విషయం ఏమిటంటే మన దేశంలో పోలీసులు స్వతంత్రంగా ఏనిర్ణయాలు తీస్కొలేరు....మరి వారికి ఆదేశాలు ఇచ్హెదెవరు అన్నీవారేచేశారని వారిని సస్పెండ్ చేసేదెవరు..అంతా మాయ....

మరి ఈ జగన్నాటక సూత్రధారి ఎవరు?

Wednesday, December 16, 2009

జెపి - మన్మోహన్ కలయిక

1)కాంగ్రేస్ పార్టీ కెసీఅర్ ప్రాణాలు కాపాడటానికి మరియు అన్ని పార్టీలు అంగీకరించినందుకే వారి మిత్రపక్షాల అభిప్రాయాన్ని తీస్కోకుండా అర్దరాత్రి ప్రకటన చెసింది ..

2)అన్ని ప్రాంతాల ప్రజల మనొభావాలను పరిగణలోకి తీస్కొని సరైన నిర్ణయం తెలంగాణా పై తీస్కొవాలి

3)శాంతిభద్రతలను కాపాడి ప్రజలు అందోళనకు గురికాకుండా చూస్కోవాలి

4)భారతదేశ ఆర్ధిక ప్రగతికి విఘాతం కలగకుండా ప్రజామోదయోగ్యమైన ప్రకటన చెయ్యాలి ..

కొసమెరుపు...

1)టివి9 విలేఖరి జెపి ని చెయ్యిపట్టుకొని పార్లమెంటు ఆవరణ బైటకి తీస్కువస్తుంటే ంటివి విలెఖరి ఆయన్ని గద్ద తన్నుకు పొయినట్టు పక్కకి తీస్కెల్లి ప్రశ్నల వర్షం కురిపించింది...టివి9 వాడు ఎమి చెయ్యలేక అక్కడే వున్న ఒక రాయలసీమ ఎంపిని ప్రశ్నిస్తూ ...మాటి మాటికి జెపి పక్కనే వున్నడో లేక వెల్లిపోయడో అని జాగర్త పడుతున్నడు..
2)టివి9వాడు జెపితో పదే పదే అన్ని రాజకీయ పార్త్టీలు యు టర్న్ తీస్కున్నాయి కదా ఇప్పుడు ప్రధాని కుడా యు టర్న్ తీస్కుంటారా అని అడిగితే ఆయన నిర్మొహమాటంగా మీటివి వాళ్ళు టీఅర్పి రేటింగ్స్ పెంచుకుంటానికి ఇలా మట్లాడకపొతే బాగుంటుంది అని అంటం విశేషం..