నిన్న రాత్రి రాజగోపాల్ అద్రుశ్యం ఈ రోజు నింస్ లోప్రత్యక్షం...
దీని మీద మీడియా హడావుడి..
ఒక చానెల్లో మరీ ఎక్కువగా ...ఇలా
ఇద్దరు ఎంపీలు..ఇద్దరిది ఒకే పంధా..ఒకరిని జైలుకి తరలించారు..ఇంకొకరిని పారిపోయేలా చేశారు ..ఎందుకీ వివక్ష అని చర్చ..ఇది నిజంగా పైత్యపు అలొచనలకి పరాకాష్ట ...
ఇంకా మీడియాకి కూడా రెగ్యులేషన్స్ పెట్టాలేమొ...
ఫ్రజల మధ్య విద్వేషాలు లేకపొయినా కలిపించటంలో అగ్రస్థానం మన నాయకులదైతే..రెండో స్థానం మీడియాది..
ఒక ప్రశ్న :
ఈ పరిస్థితుల్లో ఎవరికి ఏమిజరిగినా మొదటి టార్గెట్ ఎవరు?
ఇంకెవరు పాపం పోలీసులు ...వాళ్ళకే సస్పెన్షన్లు, మెమోలు.. ఇక్కడ చిన్నపిల్లవాడికి కూడా అర్థం అయ్యే విషయం ఏమిటంటే మన దేశంలో పోలీసులు స్వతంత్రంగా ఏనిర్ణయాలు తీస్కొలేరు....మరి వారికి ఆదేశాలు ఇచ్హెదెవరు అన్నీవారేచేశారని వారిని సస్పెండ్ చేసేదెవరు..అంతా మాయ....
మరి ఈ జగన్నాటక సూత్రధారి ఎవరు?
No comments:
Post a Comment